ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర నటి అయిన జాక్విలిన్ ఫెర్నాండెజ్కి ఎంతో విలాసవంతమైన జీవితముంది. ఆమె సొంతంగా ఒక ప్రైవేట్ ఐలాండ్ను కొనుగోలు చేసిందని చాలా మందికి తెలియదు. 2012లో ఆమె శ్రీలంక దక్షిణ తీరంలో ఉన్న నాలుగు ఎకరాల ద్వీపాన్ని 600కె డాలర్లతో కొనుగోలు చేసింది, ఇది దాదాపు రూ.3 కోట్లు.
జాక్విలిన్ ఈ ద్వీపంపై ఒక విలాసవంతమైన విల్లాను నిర్మించాలని భావించింది, కానీ ఆ విల్లా వ్యక్తిగతంగా ఉపయోగించాలా లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వాలా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆమె దానిపై ఏం చేయాలనుకుంటున్నదనేది కూడా స్పష్టంగా తెలియదు.
ఇంతలో, జాక్విలిన్ ప్రస్తుతానికి చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ సినిమాలో సాహోలో ప్రత్యేక గీతంలో నృత్యం చేసిన ఆమె, ప్రస్తుతం కెరీర్లో విజయవంతమైన దశలో ఉంది.
Read More : దీపికా పదుకొనే తిరిగి షూటింగ్లలో పాల్గొనడానికి రెడీ..
