కోలీవుడ్ హీరో కార్తీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలు చేయడంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇప్పటికే “యుగానికి ఒక్కడూ”, “ఖాకి”, “సర్దార్” వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో నటించి విజయాలు సాధించారు. ఇప్పుడు కార్తీ మరొక రియల్ లైఫ్ సంఘటనతో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. రామేశ్వరం-శ్రీలంక ప్రాంతాల మధ్య సముద్రపు దొంగల హవా నడిచే కాలానికి సంబంధించిన ఈ కథ, ప్రధానంగా సముద్ర నేపథ్యంతో సాగుతుంది. ఈ సినిమాకు “తమిళ అనే కొత్త కుర్రాడు” అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని “డ్రీమ్ వారియర్ పిక్చర్స్” నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో కార్తీ 29వ సినిమాగా నటించనున్నారు. ఇందులో వడివేలును కీలక పాత్రలో ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే, హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శిని నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది, మరియు మే లేదా జూన్లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు, కార్తీ “ఖైదీ-2” కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.

One thought on “కార్తీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మరో సినిమా: సముద్ర నేపథ్యంతో కొత్త ప్రాజెక్టు”
Comments are closed.