గౌతమ్ ఘట్టమనేని మైమ్ పెర్ఫార్మెన్స్ వైరల్

Gautam Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన తాజా మైమ్ ప్రదర్శనతో ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. మహేష్ బాబు అభిమానుల పేజీ ద్వారా షేర్ చేసిన వీడియోలో గౌతమ్ తన తరగతి సహచరులతో కలిసి మైమ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ కనిపించాడు.

ఈ వీడియోలో గౌతమ్, న్యూయార్క్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఒక హాస్యభరిత నాటకాన్ని ప్రదర్శించాడు. మాటలేకుండా కేవలం హావభావాలతో, నటనతో, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఈ పెర్ఫార్మెన్స్ సాగింది. ఇందులో భాగంగా, ఓ యువతి గౌతమ్‌తో వాగ్వాదం చేస్తూ కనిపించగా, అది ప్రదర్శనలో భాగమేనని స్పష్టమైంది. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో గౌతమ్ రెడ్ టోన్ అటైర్ ధరించి, స్టైలిష్ టక్సెడో లుక్‌లో మెరిశాడు. మైమ్ ప్రదర్శనలో భాగంగా మెలోడ్రామాటిక్ మూడ్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.

గమనించదగిన విషయం ఏమిటంటే, గౌతమ్ 2024లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్రామా కోర్సులో చేరాడు. మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార ఇద్దరూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. అయితే గౌతమ్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రైవేట్‌గా ఉంటాడు.

గౌతమ్ మైమ్ ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, మహేష్ బాబు SSMB29 సినిమాతో తన కెరీర్‌లో మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Read More





One thought on “గౌతమ్ ఘట్టమనేని మైమ్ పెర్ఫార్మెన్స్ వైరల్

Comments are closed.