ఇటీవల టాలీవుడ్లో రీ-రిలీజ్ల హవా కొనసాగుతోంది. పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. మురారి, ఆరెంజ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు రీ-రిలీజ్లో అద్భుత విజయాలు అందుకున్నాయి. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నాయక్ సినిమాను కూడా మళ్లీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే, బాలీవుడ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. తాజాగా అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన “నమస్తే లండన్” సినిమా మార్చి 14న రీ-రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకుల నుంచి ఆసక్తికరమైన స్పందన రాలేదు. 75కి పైగా షోలు వేయగా, కేవలం 985 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లలో పాత సినిమాలు చూడడం తగ్గించారు. టీవీలలో అనేకసార్లు ప్రసారమైన “నమస్తే లండన్” రీ-రిలీజ్ డిజాస్టర్గా మారింది. రీ-రిలీజ్ కోసం పెట్టిన ఖర్చు కూడా రికవరీ కాలేదన్న టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్లో మాత్రం రీ-రిలీజ్లపై క్రేజ్ పెరుగుతూనే ఉంది. వసూళ్ల పరంగా టాలీవుడ్ దూసుకెళ్తుంటే, బాలీవుడ్ రీ-రిలీజ్ల విషయంలో వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.

One thought on “రీ-రిలీజ్లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ – బాలీవుడ్లో మాత్రం ఫ్లాప్!”
Comments are closed.