భారతదేశం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇండస్ నదిపై నిర్మాణాలు చేపడితే లేదా నీటిని మళ్లిస్తే, వాటిని ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. శుక్రవారం జియో న్యూస్ ‘నయా పాకిస్తాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అప్రిల్ 22న భారత ఆధీన కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటన తరువాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడికి పాకిస్తాన్కు సంబంధం ఉందని ఆధారాలు లేకుండానే ఢిల్లీ ఆరోపణలు చేస్తూ పలు కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తానీ పౌరుల వీసాలు రద్దు చేయడం, వాఘా అటారి సరిహద్దు మూసివేయడం ఉన్నాయి.
ఇందుకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తలను దేశం విడిచిపెయ్యాలని ఆదేశించింది. సిక్కు యాత్రికులు మినహా ఇతర భారతీయుల వీసాలను రద్దు చేసింది. సరిహద్దును కూడా మూసివేసింది. ఈ దాడిలో తమకు ప్రమేయం లేదని స్పష్టంగా తెలిపిన పాకిస్తాన్, విచారణకు సిద్ధమని వెల్లడించింది.
ఈ సందర్భంలో ఆసిఫ్ మాట్లాడుతూ, “ఇండస్ నదిపై ఏవైనా నిర్మాణాలు చేపడితే, వాటిని ధ్వంసం చేస్తాం. ఇది సాధారణ దాడి కాదని, ఇది ఆక్రమణ చర్య” అని అన్నారు. “గోలులు లేదా కానన్ ఫైరింగ్ మాత్రమే కాదు.. ఆకలితో, దాహంతో ప్రజలు చనిపోవడాన్ని కూడా ఆక్రమణగానే పరిగణిస్తాం” అని తెలిపారు.
తాము ఇప్పటికే ఇండస్ వాటర్ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని చట్టపరమైన మార్గాల్లో ఈ అంశాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు. unilateralగా ఇండియా ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంపై కూడా తగినవిధంగా స్పందించనున్నట్లు చెప్పారు.
ఇండియా ప్రధాని మోదీపై కూడా ఆసిఫ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల నిమిత్తం ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా భారత్కు ఆశించిన మద్దతు లభించలేదని కూడా పేర్కొన్నారు.
“ఇండియా ఎప్పటికీ ఉద్రిక్తతలు రేపే విధంగా వ్యవహరిస్తుంది. కానీ మేము కేవలం ప్రతిస్పందనాత్మక చర్యలకే పరిమితం అవుతాం” అని ఖావాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
Read More : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

2 thoughts on “ఇండస్ నదిపై నిర్మాణాలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తే సమాధానం ఇస్తాం”
Comments are closed.