ఇంటర్నెట్ డెస్క్:
దర్శకుడు సుందర్ సీ (Sundar C) ఒకానొక సమయంలో హీరో విశాల్ (Vishal) గురించి అపార్థం చేసుకున్నానని తెలిపారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి విశాల్ గురించి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు. విశాల్ ప్రధాన పాత్రలో సుందర్ తెరకెక్కించిన ‘మదగజరాజ’ (Madha Gaja Raja) సినిమా ప్రచారంలో భాగంగా ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
“విశాల్తో నాకు స్నేహం ఏర్పడడం ఓ కథలా సాగింది. నా భార్య ఖుష్బూ, విశాల్ మంచి స్నేహితులు. అయితే, నాకు విశాల్తో పెద్దగా పరిచయం లేదు. విశాల్తో సినిమా చేస్తే బాగుంటుందని నేను, ఖుష్బూ ఒకసారి చర్చించాం. నిర్మాణ సంస్థ ద్వారా అతడితో మీటింగ్ ఏర్పాటుచేసి, నా అసిస్టెంట్ రైటర్తో కలిసి చెప్పిన చోటుకు వెళ్లాం. అక్కడికి చేరుకునే సమయంలో విశాల్ బయటకు వెళ్తుండడం గమనించాం. అయితే, దీన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు. ఏవరో విశాలా అని ఊహించుకున్నావేమో అనుకుంటూ ఆఫీసుకు వెళ్లాం. అక్కడ విశాల్ కనిపించలేదు. కోపంతో ఇంటికి తిరిగి వచ్చాక ఖుష్బూకు జరిగినది చెప్పా. ఆమె విశాల్కు మద్దతుగా నిలిచింది. నేను అతడికి కాల్ చేస్తానని అంటే ఖుష్బూ వద్దని అడ్డుకుంది,” అని సుందర్ వివరించారు.
ఇదీ చదవండి: విశాల్ ఆరోగ్యంపై వార్తలు… వైద్యులు విశ్రాంతి సూచించారు
“దాని తరువాత రెండు నెలల తర్వాత నేను ఓ సన్మాన కార్యక్రమానికి వెళ్లినప్పుడు విశాల్ కూడా అక్కడ ఉన్నాడు. నేను అతడికి దూరంగా ఉండే ప్రయత్నం చేశా. కానీ, అతడి మంచి మనసు బయటపడింది. కొందరితో కలిసి నా వద్దకు వచ్చి సారీ చెప్పాడు. అతడికి బాగా దగ్గరైన ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ ఉండడంతో ఆ రోజు మీటింగ్కు హాజరవలేకపోయాడని ఆ సమయంలో నాకు తెలుసుకుంది. నేను చాలా మంది హీరోలతో పని చేశా. వారిలో కార్తిక్ నాకు అన్నయ్యలాంటివారు. అలాగే విశాల్ నాకు తమ్ముడిలాంటివాడు,” అని సుందర్ చెప్పుకొచ్చారు.
2013లో పూర్తయిన ‘మదగజరాజ’ సినిమా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ఈ సినిమా బాక్సాఫీస్ను పలకరించబోతోంది. యాక్షన్, కామెడీగా రూపొందిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ప్రత్యేకంగా ఎయిట్ ప్యాక్ చేయించారు. అనుకున్న సమయానికి చిత్రీకరణ ఆలస్యమైనా, మరో సినిమా అంగీకరించకుండా ఆ ప్యాక్ను కొనసాగించారని సుందర్ మరో ఇంటర్వ్యూలో విశాల్పై ప్రశంసలు కురిపించారు.
