లగ్జరీ కార్లను సొంతం చేసుకోవడంలోనే కాకుండా లగ్జరీ వాచ్లను ధరించడంలోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కి ప్రత్యేకమైన అభిరుచి ఉంది. త్వరలో విడుదలకానున్న తన తాజా చిత్రం సికందర్ ప్రమోషన్ సందర్భంగా, సల్మాన్ ఖాన్ జాకబ్ & కో. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్ను ధరించి మెరిసిపోయాడు. ఈ వాచ్ ధర రూ. 34 లక్షలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్, హస్తకళా నైపుణ్యంతో తయారైన ఈ టైమ్పీస్, అభిమానులు మరియు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.
సల్మాన్ ఖాన్కు జాకబ్ & కో బ్రాండ్తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ జాకబ్ అరాబోతో సల్మాన్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఈ లగ్జరీ వాచ్లను సల్మాన్ తన సినిమాల ద్వారా ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అయితే, ఈ బంధం కేవలం బ్రాండ్ ఎండార్స్మెంట్ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇద్దరూ కుటుంబ స్నేహితులు. జాకబ్ తండ్రి, సల్మాన్కి ది వరల్డ్ ఈజ్ యువర్స్ థీమ్తో ఒక ప్రత్యేకమైన వాచ్ను బహుమతిగా ఇచ్చారు. ఆ కానుక వారి బంధాన్ని మరింత బలపరిచింది.
అంతేకాక, సల్మాన్ తండ్రి సలీం ఖాన్కు గౌరవంగా ప్రత్యేకంగా రూపొందించిన టైమ్పీస్ రూపకల్పనలో కూడా జాకబ్ & కో సహకరించింది. సల్మాన్ కోసం మరియు అతని తండ్రి కోసం ప్రత్యేకమైన వాచ్లను ఈ బ్రాండ్ ప్రత్యేకంగా తయారు చేసింది.
ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన తదుపరి చిత్రం సికందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సల్మాన్ ఖాన్ మళ్లీ మరో పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

One thought on “సల్మాన్ ఖాన్ చేతిపై రూ. 34 లక్షల ‘రామమందిరం’ డిజైన్ లగ్జరీ వాచ్”
Comments are closed.