కనకదుర్గమ్మ ఆలయంలో పాము కలకలం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పాము కనిపించడం భక్తులను భయాందోళనలకు గురిచేసింది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న క్యూ లైన్‌లో ఒక్కసారిగా పాము రావడం చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు.

పాము పట్టుకున్న అధికారులు

ఈ ఘటన ఆలయ ప్రాంగణంలో కాసేపు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం పామును పట్టుకుని ఒక సంచిలో బంధించి, సురక్షిత ప్రాంతానికి తరలించింది. పాము కనిపించిన సమయంలో పోలీసులు, ఆలయ సిబ్బంది భక్తులను అదుపులోకి తీసుకుని, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తపడ్డారు.

ఈ ఘటనతో ఆలయానికి వచ్చే భక్తులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో క్యూ లైన్‌లో ఉన్నవారు కాసేపు తీవ్ర భయానికి గురయ్యారు.

Read More : ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్.