సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గాయనీ సైంధవి వివాహ బంధానికి స్వస్తి పలకడం ఇటీవల చర్చనీయాంశమైంది. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారు. కానీ, వీరి విడాకులపై నటి దివ్యభారతి పేరు అనవసరంగా లాగడం వివాదాస్పదమైంది. జీవీ, దివ్యభారతి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమ సంబంధంగా చిత్రీకరించడం పట్ల దివ్యభారతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దివ్యభారతి ఈ ప్రచారంపై స్పందిస్తూ, జీవీతో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, తప్పుడు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వదంతులను పట్టించుకోవద్దని, కెరీర్పై దృష్టి పెట్టాలని జీవీ సలహా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. జీవీ కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, తమ మధ్య ఏవైనా అనుమానాలు ఉండకూడదని విజ్ఞప్తి చేశారు.
జీవీ ప్రకాష్, దివ్యభారతి ‘కింగ్స్టన్’ సినిమాలో నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు ‘బ్యాచిలర్’ చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ‘కింగ్స్టన్’ విడుదలకు సమీపిస్తున్న క్రమంలో ఈ స్నేహం అనవసరంగా సంబంధంలా మారిపోయింది. అదే సమయంలో జీవీ-సైంధవి విడాకుల ప్రకటన రావడం వల్ల ప్రచారం మరింత ఉద్ధృతమైంది.

One thought on “జీవీ ప్రకాష్-సైంధవి విడాకులపై దుష్ప్రచారం: దివ్యభారతి స్పందన”
Comments are closed.