టాలీవుడ్ నటి అదా శర్మ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖంపై గాయాలున్న ఫొటోలతో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇవేంటంటే, అదా శర్మ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో గాయాలతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ముఖం మీద గాయాలతో ఉన్న ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం జరిగినవి కాదని, ఆమె గతంలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా షూటింగ్ సమయంలో తీసినవని తేలింది.
ఆ సినిమా విడుదలై మే 5 నాటికి రెండేళ్లు పూర్తి కావడంతో, అదా తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలు షేర్ చేసింది. ఈ మూవీ లో ఆమె పోషించిన పాత్ర కోసం ఎంతో శ్రమపడినట్టు తెలుస్తోంది. గాయాలకూ, కష్టాలకూ మధ్య తాను నటించిన దృశ్యాలు ఇవేనంటూ గుర్తు చేసింది.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఆ సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందినంతగా, రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ద్వారా అదా శర్మకు కొత్తగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ వైరల్ ఫొటోలు ఆమె డెడికేషన్ను మరోసారి హైలైట్ చేస్తున్నాయి.

One thought on “టాలీవుడ్ బ్యూటీని చూసి షాక్.. ముఖం నిండా గాయాలే!”
Comments are closed.