టీమిండియా స్పాన్సర్షిప్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద రంగాలకు చెందిన కంపెనీలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ, కొత్త స్పాన్సర్ ఎంపిక కోసం మంగళవారం టెండర్లు ఆహ్వానించింది.
ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రస్తుత స్పాన్సర్ డ్రీమ్ 11 వైదొలగడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్రిప్టో ట్రేడింగ్, టోకెన్ల వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థలు బిడ్డింగ్లో పాల్గొనడానికి అనర్హులు. ఇప్పటికే నిషేధిత బ్రాండ్లతో అనుబంధం ఉన్న కంపెనీలకూ అవకాశం లేదని తేల్చిచెప్పింది.
అలాగే, దరఖాస్తు చేసుకునే సంస్థల వార్షిక టర్నోవర్ కనీసం రూ.300 కోట్లు ఉండాలని బీసీసీఐ షరతు విధించింది. ఆసక్తి గల సంస్థలు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.
ఈ స్పాన్సర్షిప్ ప్రధానంగా టీమిండియా జెర్సీలకే సంబంధించినది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో, అంతకుముందే కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
Read More : ఆర్సీబీ విషాదంపై స్పందన ?
One thought on “టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ కొత్త టెండర్లు విడుదల.”
Comments are closed.