హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత నిన్నే సమ్మిట్కు రావాల్సి ఉన్నా, కశ్మీర్ ప్రయాణం కారణంగా ఆలస్యం అయిందని, అందుకు క్షమాపణలు కోరారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం ప్రతిపక్ష స్వరాలను అణిచివేసే దూకుడు రాజకీయం నడుస్తోందని విమర్శించారు. కొంతకాలం క్రితం తమ పార్టీ పూర్తిగా ఒంటరిగా మిగిలిందని, తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయని, మీడియా సహా అన్నీ ప్రతికూల పరిస్థితుల్లో ఎదురయ్యాయని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే చరిత్రను గుర్తుచేసుకుంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టామని, ఆ ప్రయాణం ద్వారా తాను రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నానని రాహుల్ వెల్లడించారు.
“మా ప్రత్యర్థులు కోపం, భయం, ద్వేషంపై పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. ఆ విషయంలో వారితో పోటీ చేయడం మాకు సాధ్యపడదు. అలాంటి భావోద్వేగాల్లో వారు మమ్మల్ని మించినవారే. అందుకే మేము ఇతర మార్గాల్లో ప్రజల మద్దతు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాం,” అని స్పష్టం చేశారు.
తమ పార్టీని పునర్నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలతో నేరుగా కలసి పని చేయడం ద్వారా భవిష్యత్తును మలుచుకుంటామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Read More : పహల్గామ్ ఘటనపై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది

One thought on “భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు”
Comments are closed.