ఇరాన్ అణు కార్యక్రమాలను ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుంటోందా? లెబనాన్లో హిజ్బుల్లా నేతలను లక్ష్యంగా చేసుకుని పేజర్, వాకీటాకీ బాంబులను పేల్చిన ఇజ్రాయెల్.. ఇరాన్పై కూడా అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలని యోచించిందా? ఇరాన్ అణు పరికరాల్లో ఐఈడీలను అమర్చిందా? టెహ్రాన్ అణు కార్యక్రమాలను తన నియంత్రణలోకి తీసుకుని, అణ్వాయుధాలు, ఇతర అణు ప్రాజెక్టులను నిప్పు పెట్టడానికి వ్యూహం రచించిందా?
ఇరాన్ వ్యూహాత్మక వ్యవహారాల ఉపాధ్యక్షుడు మరియు విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ‘ఇరాన్ ఇంటర్నేషనల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వివరించారు. ఆయన మాట్లాడుతూ, “ఇజ్రాయెల్ మా అణు కార్యక్రమాలకు సంబంధించిన పరికరాల్లో బాంబులు అమర్చిందని మేము గుర్తించాము” అని అన్నారు.
2020లో నతాంజ్ అణు కేంద్రంలో జరిగిన భారీ ప్రమాదం గుర్తుంచుకుంటే, 2021లో సైబర్ దాడి కూడా జరిగింది. ఈ ఘటనలను ఇరాన్ ‘న్యూక్లియర్ టెర్రరిజం’ అని అభివర్ణించింది. జరీఫ్ తాజా ఆరోపణలు 2021లో కొనుగోలు చేసిన సెంట్రల్ ఫ్యూజ్కు సంబంధించినవిగా చెబుతున్నారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజక్షియాన్ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ఆయన, ఎన్బీసీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరాన్ యుద్ధం పట్ల ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
